సుంకరపాలెం డ్రైనేజీ సమస్యను పరిశీలించిన ప్రజాప్రతినిధులు ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పరిధిలోని జాతీయ రహదారి సుంకరపాలెం వై జంక్షన్ వద్ద గత కొద్ది రోజులుగా ద్రాక్షారామ వైపు వెళ్లే రోడ్డు పై జాతీయ రహదారి చెంతనే ఉన్న డ్రైనేజీ ద్వారా నీరు పైకి రావడంతో ప్రజలు, వాహనాల మీద వెళ్లేవారు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య స్థానిక తాళ్లరేవు మండల కూటమి నాయకులు స్థానిక ఎమ్మెల్యే దాట్లసుబ్బరాజు, ఎంపీ గంటి హరీష్ మాధుర్ దృష్టికితీసుకెళ్లగా, శుక్రవారం ఎంపీ ఎమ్మెల్యే సుంకరపాలెం జంక్షన్ కు వచ్చి డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. అనంతరంవారు మాట్లాడుతూ డ్రైనేజీ సమస్య వెంటనే పరిష్కరించే విధంగాచర్యలు తీసుకుంటామని అన్నారు.అక్కడ ఉన్న సంబంధిత అధికారులనుపిలిచి తక్షణమే డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని అధికారులను ఎంపీ ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాళ్లరేవు మండల పరిధిలోని నాయకులు, అధికారులు పాల్గొన్నారు.