కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాళ్లూరు గ్రామంలో గల పుష్కర అంతర్భాగం తాళ్లూరు లిఫ్ట్ ప్రధాన కాలువ యొక్క కి.మీ 45.195 వద్ద ఉన్న తాళ్లూరు లిఫ్ట్ పంప్ హౌస్ వద్ద ఉన్న పి ఎస్ సి ప్రెజర్ మెయిన్ను ఎం ఎస్ ప్రెజర్ మెయిన్తో భర్తీ చేయడానికి పరిపాలనా ఆమోదంతో కూడిన ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. 52 కోట్లతో పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. అదేవిధంగా మల్లవరం ఎత్తిపోతల పథకానికి 140 కోట్లు రూపాయలు మరో 10 రోజుల్లో పరిపాలన ఆమోదం పొందడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మా పెద్ద తండ్రి జ్యోతుల పాపారావు ఇర్రిపాక, మామిడాడ, నరేంద్ర పట్నం, కాండ్రేగుల, గొల్లలగుంట గ్రామాలను కలుపుతూ సాగు నీరు అందించేందుకు జ్యోతుల పాపారావు నీటి పథకం ఈ నెలాఖరులో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు హాజరవుతారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పైడిపాల సూరిబాబు, పాండ్రంగి రాంబాబు, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.