కాకినాడ జిల్లా పెద్దాపురం రామారావు పేటలోని ఏసిటి సైన్స్ సెంటర్లో, కిర్లంపూడి మండలం తామరాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు భౌతిక శాస్త్రంలోని ఆమ్లాలు,క్షారాలు,లవణాలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన అనేక ప్రయోగాలను సైన్స్ సెంటర్ నిర్వాహకులు బుద్దా శ్రీనివాస్ ప్రాయోగికంగా నేర్పించారు.
సహజ సూచికలను ఉపయోగించి ఆమ్లాలు, క్షారాలను గుర్తించడం, ఎర్ర,నీలి లిట్మస్ పేపర్లతో పరీక్షించడం, సింథటిక్ ఇండికేటర్ల సహాయంతో ఆమ్ల,క్షారాలను వర్గీకరించడం, వివిధ ద్రవాల పిహెచ్ విలువలను గుర్తించడం, ఆమ్లాలు,క్షారాల ద్వారా విద్యుత్ ప్రవాహం ఎలాజరుగుతుందో తెలుసుకోవడం వంటి ప్రయోగాలు విద్యార్థులు ప్రాక్టికల్గా చేసారు.ఇలాంటి వర్క్షాప్ల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులభంగా అర్థం చేసుకోవడంతో పాటు ప్రయోగపూర్వకంగా నేర్చుకునే అవకాశం కలుగుతుందని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కృష్ణ అభిప్రాయపడ్డారు. మధ్యాహ్నం సెషన్లో విద్యార్థులు భౌతిక శాస్త్రంలోని రసాయన సమీకరణాలు మరియు చర్యలు అనే పాఠ్యాంశానికి సంబంధించిన ప్రయోగాలను స్వయంగా నిర్వహించారు. విద్యార్థులకు మిషన్ అన్నపూర్ణ సహాయనిధి వ్యవస్థాపకులు రాజేష్ కుమార్ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు జి. అరుణ శంకర్, కె. మహేష్, తామరాడ హై స్కూల్ విద్యా కమిటీ ఛైర్మన్ ఎలుగుబంటి శ్రీను, హెచ్.ఎం. కృష్ణ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.