ఉద్యమాలు అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెడతాం
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ :-రామచంద్రపురం నియోజకవర్గం బిసివై పార్టీ ఇంచార్జ్ బర్ల.శ్రీనివాస్ యాదవ్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టనీయకుండా భారతచైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ ను పోలీసులు అడ్డుకున్న తీరు ప్రజాస్వామ్యానికి మచ్చ అని వ్యాఖ్యానించారు.అలానే భారతరాజ్యంగం ప్రసాదించిన సంచార స్వాతంత్ర్యానికి విరుద్ధంగా వ్యవహరించి,పోలీసులు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.గత ప్రభుత్వం కూడా ప్రతిపక్షాలపై ఇదే తీరున ప్రవర్తించి హోదాలేని ప్రతిపక్షంగా మారిపోయిందని ఆయన గుర్తుచేశారు.అధికారం అడ్డుపెట్టుకొని ఉద్యమాలను అడ్డుకోలేరని, ప్రజాసమస్యలు ఉన్నంతకాలం పోరాటం చేస్తూనే ఉంటామని మా గొంతులు నొక్కలనీ చూస్తే ప్రజా వ్యతిరేకత మూటకట్టుకోవలసి ఉంటుందని విమర్శించారు. ఉద్యమాలు అడ్డుకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు ప్రారంభమవుతాయని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.