మండపేట మండలం కేశవరం కు చెందిన వైసిపి రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు ను వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు గా పార్టీ అధిష్టానం నియమించింది. జగన్ కు అత్యంత సన్నిహితులు గా గుర్తింపు పొందిన వెంకన్న బాబు వైసిపి ఆవిర్భావం నుంచి పార్టీ లో క్రియాశీలక పాత్ర పోషించారు. వైసిపి అధికారం లో ఉండగా ఆయన సతీమణి ను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పదవి లో నియమించారు. ఈ నేపధ్యంలో దూలం వెంకన్నబాబు ని కేశవరం వైసిపి పార్టీ కార్యాలయంలో పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. మాజీ ఎంపీటీసి ప్రసన్నకుమార్, కూసు దొరజీ , నియోజకవర్గ వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు అబ్బిరెడ్డి వీర్రాజు , బందెల సాయిరామ్, యడ్ల రవి , కామిరెడ్డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.