14 October 2025
Tuesday, October 14, 2025

విద్యార్థులకు వ్యవసాయ పంటలపై అవగాహన కార్యక్రమం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

విద్యార్థులకు వ్యవసాయ పంటలపై అవగాహన కార్యక్రమం

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్

కరప మండలం నడకుదురు గ్రామం మండల ప్రజా పరిషత్ మోడల్ పాఠశాల, నడాకుదురు నెంబరు1 కరప మండలం నందు విద్యార్థులకు క్షేత్ర పర్యటనలో భాగంగా స్థానికంగా గల పంట పొలంకు పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయుడు వాకాడ వెంకటరమణ తీసుకుని వెళ్లి విద్యార్థులచే వరి నాట్లు, నాటుటపంటలు పెంచుట గురించి అవగాహన కల్పించారు, విద్యార్థులు ఏరువాక సాగు గురించి తెలుసుకున్నారు. స్థానికంగా గల రైతులతో విద్యార్థులు ముచ్చటించారు. పంట ఎదుగుదల,కలుపు తీయడం, ఎరువులు వేయడం, మందుల పిచికారి, గురించి తెలుసుకున్నారు.పంటను చేతికి వచ్చేవరకు అన్నదాత 180 రోజులు పాటు ఎంతో శ్రమ పడతారని తెలుసుకున్నారు.మొదలగు విషయాలు అన్ని రైతులను అడిగి తెలుసుకుని విద్యార్థులు,పంటలు సాగు గూర్చి పూర్తి అవగాహన పొందారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వాకాడ వెంకటరమణ మాట్లాడుతూ తమ పిల్లలకు తరగతి గదులు పాఠశాలల్లోనే చదువు కాకుండా పరిశీలించడం, స్వయ అనుభవం ద్వారా వారికి గుర్తుకుంటుందని మంచి అవగాహపొందుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ కె. మేరీ రత్నకుమారి, ఉపాధ్యాయులు బుంగ రాంబాబు, కె విజయలక్ష్మి, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
సక్సెస్ వాయిస్
పండుగలు
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo