Monday, August 4, 2025
Monday, August 4, 2025

వ్యభిచారం చేయమని ఒత్తిడి.. నిరాకరించిందని ప్రియుడు చాకుతో పొడిచి హత్య

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

వ్యభిచారం చేయమని ఒత్తిడి.. నిరాకరించిందని ప్రియుడు చాకుతో పొడిచి హత్య

విశ్వం వాయిస్ న్యూస్, రాజోలు

రాజోలు మండలం బి.సావరం గ్రామం సిద్ధార్థనగర్ లో ఓ వివాహిత యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది.

స్థానికంగా నివాసముంటున్న ఓలేటి పుష్ప (22) గతంలో వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది. అనంతరం షేక్ షమ్మ (22) అనే యువకుడితో కలిసి గత ఆరు మాసాలుగా బి.సావరం గ్రామంలో అద్దె ఇంట్లో సహజీవనం చేస్తోంది.

షమ్మ గత కొన్ని రోజులుగా మద్యంతాగి పుష్పను వ్యభిచారం చేయాలని గొడవపడుతూ ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో “నా వెంట రావాలి” అంటూ మరోసారి అదే విషయంపై వాదన చోటుచేసుకుంది. పుష్ప నిరాకరించడంతో కోపంతో షేక్ షమ్మ ఆమెను చాకుతో ఎడమ రొమ్ము మీద, కాలిపై పొడిచి హత్య చేశాడు.

దీనితో పాటు పుష్పను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె తల్లి గంగ, సోదరుడిని కూడా గాయపరిచి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావం అయిన పుష్ప ఘటనాస్థలంలోనే మృతి చెందింది.

సమాచారం అందుకున్న రాజోలు సీఐ నరేష్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. నిందితుడు షేక్ షమ్మ కోసం 2 టీమ్ లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
క్రీడా వాయిస్
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo