శ్యామ్ఇన్స్టిట్యూట్ అధినేత కు”చేయూత రవి అభినందనలు.
ఇటీవల విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో 75 శాతం పైగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉత్తీర్ణులు కావడంతో శ్యామ్ ఇనిస్టిట్యూషన్స్ కొత్త రికార్డ్ సృష్టించిందని చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మొండి రవికుమార్ అన్నారు . శ్యామ్ ఇన్స్టట్యూట్ లో అధినేత శ్యామ్ ను ప్రత్యేకంగా శాలువా కప్పి ప్రశంసించారు. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ ఎన్నో వేల కుటుంబాలకు జీవనోపాధి కల్పించడంలో శ్యామ్ చూపిస్తున్న శ్రద్ధ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో అత్యధికంగా ఉత్తీర్ణత పొందడం తద్వారా కాకినాడ జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని కొనియాడారు. శ్యామ్ మాట్లాడుతూ సివిల్ విభాగంలో 2590 ఏపీఎస్పీ కానిస్టేబుల్స్ విభాగంలో 2083 మంది శ్యామ్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అన్నారు. మొత్తం6014 మంది విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించారని అందులో 4673 మంది విద్యార్థులు శ్యామ్ ఇన్స్టిట్యూట్ చెందినవారు కావడం గర్వకారణమని శ్యామ్ అన్నారు. ఉత్తమ విద్యా బోధనను సద్వినియోగం చేసుకుంటూ ఎంతోమంది విద్యార్థులు తమ తమ లక్ష్యాలను చేరుకోవడంలో సఫలీకృతమయ్యారని కొనియాడారు. సబ్ ఇన్స్పెక్టర్ మరియు పోలీస్ కానిస్టేబుల్ లకు చెందిన నూతన బ్యాచులను ఈ నెల 11 నుండి ప్రారంభిస్తున్నట్లు శ్యామ్ ప్రకటించారు .సమాజానికి రక్షణ కల్పించే వ్యక్తుల అభ్యున్నతి కోసం తమ సంస్థ మరిన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ను బోధిస్తామని శ్యామ్ అన్నారు .రెండు తెలుగు రాష్ట్రాలలో శ్యామ్ విద్యార్థులు ఉన్నత స్థానంలోనూ మరియు మార్గదర్శకులుగా ఉన్నారని తెలిపారు.

