ఈ వారం అన్న క్యాంటీన్ దాత కిర్లంపూడి మండల టిడిపి అధ్యక్షు లు వీరం రెడ్డి రామలింగేశ్వర స్వామి(కాశీ బాబు)
కాకినాడ జిల్లాజగ్గంపేట స్థానిక కాకినాడ రోడ్డులో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత మూడున్నర సంవత్సరాలుగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు కిర్లంపూడి మండలంటిడిపి అధ్యక్షులు వీరం రెడ్డి రామలింగేశ్వర స్వామి (కాశి బాబు) వారి ఆర్థిక సహాయంతో నిర్వహించారు .ఈ అన్నా క్యాంటీన్ కు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు రద్దు చేయడంతో ప్రతిపక్షంలో ఉండి కూడా తెలుగుదేశం ఎక్కడికి అక్కడ టిడిపి నాయకులు కార్యకర్తల సహకారంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో భాగంగా జగ్గంపేటలో కూడా గత నాలుగు సంవత్సరాలుగా అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని మళ్లీ కూటమి ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ కు భవనం నిర్మాణంలో ఉందని తొందర్లోనే ఏర్పాటు అవుతుందని అప్పటివరకు దాతల సహకారంతో కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, బుర్రి సత్తిబాబు, రాయి సాయి, చాగంటి వీర వెంకట సత్యనారాయణ, డేగల సత్తిబాబు, ఎస్ వి ప్రసాద్, మారిశెట్టి గంగ, పుర్రె వీరబాబు, తదితరులు పాల్గొన్నారు.

