01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

కే గోపాలపురంలో గిరిజనుల శిథిలావస్థలో ఉన్న గృహాల స్థానంలో మోడల్ ఇల్లు నిర్మాణం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

పి4 పథకంలో నిర్మించేందుకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నిర్ణయం

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

గండేపల్లి మండలం కే గోపాలపురం గ్రామంలో 1985లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గిరిజనులకు ఐదు సెంట్లు స్థలం 3000 నగదు ఇచ్చి పెంకుల ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది. 40 సంవత్సరాలు పూర్తి అవ్వడంతో ఇల్లు శిధిలావస్థకు చేరుకున్నాయి. కే గోపాలపురం గ్రామం నుంచి గిరిజనులు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కలిసి విషయం తెలియజేశారు. ఆయన శుక్రవారం కే గోపాలపురం గ్రామంలో శిధిలావస్థలో ఉన్న ఇల్లు స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజనుల కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇల్లను ప్రభుత్వం పి 4 పథకం లో ఇనప రేకులతో మోడల్ గృహాలుగా నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నానని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. ఆయన వెంట మండల టిడిపి అధ్యక్షులు పోతుల మోహనరావు, పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు, కే గోపాలపురం మాజీ సర్పంచ్ అవసరాల బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo