కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్(ఐపీఎస్ )ఆదేశాల మేరకు మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులపై తక్షణ చర్యలు తీసుకుంటూ ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు.
కాకినాడ జిల్లా గండేపల్లి మండలానికి చెందిన 19 ఏళ్ల అవివాహిత యువతి అనామిక ఆగస్టు 19న కనిపించకపోవడంతో, ఆమె తల్లిదండ్రులు ఆగస్టు 20వ తేదీ ఉదయం 10 గంటలకు గండేపల్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు Cr.No. 254/2025 u/s ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ సాంకేతిక సహకారంతో, జగ్గంపేట సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్, గండేపల్లి ఎస్ఐ శివ నాగబాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కోటనందూరు, హైదరాబాద్ ప్రాంతాలకు గాలింపు దళాలను పంపారు. ఈ క్రమంలో యువతిని హైదరాబాద్ దిల్సుఖ్నగర్ ప్రాంతంలో గుర్తించి, సురక్షితంగా గండేపల్లికి తరలించినట్లు సీఐ వై.ఆర్.కె. శ్రీనివాస్ తెలిపారు.