జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
కాకినాడ జిల్లా జగ్గంపేట లో జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జగ్గంపేట టౌన్ లో గల స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో లో మొక్కలు నాటారు. అనంతరం తుమ్మలపల్లి రమేష్ జన సైనికులతో కలిసి ప్రభుత్వ హాస్పిటల్ లో గల రోగులకు ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ తెలుగు యువతను సేవాభావం వైపు నడిపి, సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంది ప్రజలకు రక్తదానం, నేత్రదానం చేసినటువంటి సేవా ప్రదాత, చిత్ర రంగంలో తన పేరును చెరగని అక్షరాలతో లిఖించిన నట శిఖరం మెగాస్టార్ చిరంజీవి అని, వారి జన్మదినం సందర్భంగా వారి అభిమానులుగా మేము కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.ఎన్నో కోట్ల మంది యువత హృదయాలలో జరగని ఒక చిహ్నం చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం గ్రామ సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణ శేఖర్, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను,మరిసే రామకృష్ణ,మాదారపు వీరబాబు,గోకేడ ప్రసాద్,పాఠంశెట్టి రమేష్,గంధం శ్రీను,అంకం ఓం కృష్ణ,గండికోట శ్రీను
మల్ల వీర దుర్గ,తుమ్మల మనోజ్,కిలాని శివాజీ,అడబాల వీరబాబు,చిరుత తాతజీ,రేవూరి శ్రీను,గంధం వంశీ
సూరబతుల వీరబాబు, పులి ప్రసాద్, జుట్టుక నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు