జగ్గంపేట సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్
కాకినాడ జిల్లా పోలీస్ శాఖ విద్యార్థుల భద్రత పట్ల మరింత అప్రమత్తంగా ఉంది. విద్యా సంస్థల వద్ద ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ లాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు జగ్గంపేట సర్కిల్ పరిధిలో ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు డ్రోన్ల సహాయంతో పాఠశాలలు, కళాశాలల వద్ద జగ్గంపేట సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు.ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో పాఠశాలలు, ప్రైవేట్ కళాశాలల వద్ద డ్రోన్ల ద్వారా నిఘా కొనసాగుతోంది. డ్రోన్ కెమెరాల సాయంతో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించి, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు, విద్యార్థినులలో భద్రతాభావాన్ని పెంపొందించడంతో పాటు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా నియంత్రించడం పోలీసుల ప్రధాన లక్ష్యంగా మారింది.గురువారం కిర్లంపూడి మండలం బూరుగుపూడి హై స్కూల్ వద్ద డ్రోన్ కెమెరా సాయంతో పరిసరాల పర్యవేక్షణ జరిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని జగ్గంపేట సర్కిల్ పోలీసులు తెలిపారు.
విద్యార్థుల భద్రతకు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు – డ్రోన్లతో నిఘా పటిష్టం” అని వారు స్పష్టం చేశారు.