సిడిపిఓ పూర్ణిమ
తల్లి పాలు ప్రతి శిశువు ఆరోగ్యానికి అత్యంత కీలకమని సిడిపిఓ ఎం. పూర్ణిమ పేర్కొన్నారు. మండల కేంద్రమైన జగ్గంపేట మరియు మన్యంవారిపాలెం గ్రామంలో శుక్రవారం తల్లిపాలు వారోత్సవాలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గర్భిణీలకు, బాలింతలకు, వారి కుటుంబ సభ్యులకు తల్లి పాలను అందించడంలో ఉండే లాభాలపై అవగాహన కల్పించబడింది.ఈ కార్యక్రమంలో మాట్లాడిన సిడిపిఓ పూర్ణిమ మాట్లాడుతూ,తల్లి పాలు శిశువుకు రోగనిరోధక శక్తిని పెంచుతూ, ఇన్ఫెక్షన్లను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలు పీల్చడం ద్వారా తల్లిలో పాలు ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో తల్లి–బిడ్డ బంధం బలపడుతుంది. అంతేకాకుండా తల్లికి రక్తస్రావం తగ్గి, శరీర ధృఢత్వం పొందుతుంది” అని వివరించారు.ఈ వారోత్సవాల సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో భౌతికంగా సమావేశాలు నిర్వహించి, విజ్ఞానంపై అవగాహన కల్పించడం, తల్లి పాల పై ప్రాముఖ్యతను తెలియజేసే ర్యాలీలు, సమాచార పోస్టర్లు వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలు ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ఆమె తెలిపారు.
.చివరిగా గ్రామంలో శిశు పోషణ పై అవగాహన కల్పించే ర్యాలీ నిర్వహించబడింది. తల్లి పాలు ఆరోగ్యానికి పునాది అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మన్యంవారిపాలెం గ్రామ సర్పంచ్, అంగన్వాడీ సూపర్వైజర్లు అమ్మాజీ, సునీత, మహిళా ఆరోగ్య కార్మికులు ,మహిళా పోలీసులు, ఏ ఎన్ ఎం లు , ఆశ వర్కర్లు, తల్లులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు