Saturday, August 2, 2025
Saturday, August 2, 2025

త్రాగి వాహనం నడపిన 6 మందిలో 5 మందికి జరిమానా – ఒకరికి జైలు శిక్ష

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల కఠిన చర్యలు

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు త్రాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆదేశించిన నేపథ్యంలో కిర్లంపూడి పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.ఇందులో భాగంగా, ఇటీవల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని, గౌరవ పత్తిపాడు కోర్టు ముందు హాజరుపరిచారు.కోర్టు విచారణలో ఒక వ్యక్తికి మూడు రోజుల జైలు శిక్ష విధించగా, మిగతా ఐదుగురికి రూ.10,000 చొప్పున జరిమానా విధిస్తూ మొత్తం రూ. 50,000 జరిమానా విధించింది.ఈ సందర్భంగా సీఐ వై.ఆర్.కె శ్రీనివాస్ మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే త్రాగి వాహనదారులపై కఠిన చర్యలు తప్పవు. ఈ రకమైన తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరం కొనసాగుతాయి” అని హెచ్చరించారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
రాజకీయాలు
కాకినాడ
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo