Monday, August 4, 2025
Monday, August 4, 2025

ఫస్ట్ ర్యాంక్ విద్యార్థులకు మాజీ సర్పంచ్ మీసాల తాతారావు ప్రతిభ అవార్డ్స్

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

జగ్గంపేట

కాకినాడ జిల్లాలోని జగ్గంపేటలో మాజీ పంచాయతీ సర్పంచ్ స్వర్గీయ మీసాల తాతారావు జయంతిని పురస్కరించుకొని విశేష కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించారు.మీసాల తాతారావు సతీమణి మీసాల బంగారమ్మ చేతుల మీదుగా విద్యార్థులు లక్కాకుల నందిని (549 మార్కులు), అడపా సామ్యూల్ (479 మార్కులు)లకు ఒక్కొక్కరికి రూ. 5,000 నగదు పురస్కారాలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్లు పంపిణీ చేశారు. మీసాల బంగారమ్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తాతారావు జయంతి రోజున పదో తరగతిలో మండలంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు ప్రతిభా అవార్డులు అందించడం పరంపరగా కొనసాగుతుందని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో లక్కాకుల శీను, వెంట్రాప్రగడ రమేష్, జాజుల అచ్యుత్, రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
తెలంగాణ
వనిత వాయిస్
కృష్ణా
క్రీడా వాయిస్
టాలీవుడ్‌
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo