స్థానిక జేవియర్ అపార్ట్మెంట్ లో జగ్గంపేట మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జీను మణి బాబును మర్యాదపూర్వకంగా కలిసి ది సంజీవి ఫిషర్ మాన్ సొసైటీ సంఘం ఘనం గా సత్కరించారు .మండల తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సాంబత్తుల చంద్రశేఖర్, తుమ్మల కిషోర్ లతో కలిసి జీను మణిబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా జ్యోతుల నెహ్రూ తో కలిసి పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న మణి బాబుని గుర్తించి పార్టీ అధ్యక్షుడిగా నియమించినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉందని వారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం ఫిషర్మెంట్ సొసైటీ సమస్యలు కూడా మణి బాబుతో చర్చించి ఎమ్మెల్యే సహకారం పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కందరాడ చందర్రావు, కడితి లాజర్, మేడపాటి శేఖర్ బాబు, బూరా చక్రం, పడాల పెద్ద అప్పారావు, ఉంగరాల జీవరత్నం,ముర అబ్బులు, సలాది రాజు, మరల రాజబాబు, మరల ప్రకాష్, కడితి ప్రసాద్, భకి సరోజినీ, లండ రావులమ్మ, గుల్ల రాజబాబు, పడాల వెంకయ్యమ్మ, తదితరులు పాల్గొన్నారు.