Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications
Sunday, August 3, 2025
🔔 9
Latest Notifications

వీరవరం సొసైటీ చైర్మన్‌గా తోట సతీష్ కుమార్ (గాంధీ) నియామకం

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మణి దంపతులను ..మర్యాదపూర్వకంగా కలిసిన గాంధీ

 

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్వగృహంలో ఇటీవల వీరవరం ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ చైర్మన్‌గా నియమితులైన తోట సతీష్ కుమార్ (గాంధీ) మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మరియు ఆయన భార్య మణి దంపతులను కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దంపతులను గౌరవపూర్వకంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వీరవరం సొసైటీకి తాజాగా సభ్యులుగా నియమితులైన నమసాని త్రాసు, మణుగుల బాబ్జి కూడా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ‘‘చైర్మన్ పదవికి అవకాశం కల్పించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారి మార్గనిర్దేశనతో సొసైటీ అభివృద్ధికి కృషిచేస్తాను. రైతులకు అందే రాయితీలను సమర్ధవంతంగా వినియోగపరిచి ఎల్లప్పుడు వారి సేవలో నిలబడతాను,’’ అని తెలిపారు.చైర్మన్‌గా నియమితులైన తోట గాంధీకి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ తోట రవి, క్లస్టర్ ఇంచార్జి వీరారెడ్డి కాశిబాబు, పాఠం శెట్టి మురళీకృష్ణ, నీలం శ్రీను, జ్యోతుల రాంబాబు, గో డేబాల, కంట శ్రీను, కంచుమర్తి రాఘవ, సూరిశెట్టి వెంకట శివ, గోడే దొరబాబు, కరణం బురయ్య, కానూరి కాసులు,నారాయణరావు, బీసెట్టి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
విద్య వాయిస్
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
అలూరి సీతారామరాజు
ఆధ్యాత్మికం
సక్సెస్ వాయిస్
సినీ వాయిస్
తూర్పు గోదావరి
టెక్నాలజీ
కృష్ణా
తెలంగాణ
వనిత వాయిస్
బిజినెస్ వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo