01 December 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.
Monday, December 1, 2025
🔔 0
Latest Notifications
  • No posts found for today or yesterday.

హిందూ జనశక్తి జిల్లా అధ్యక్షులు బోధ శివభద్రరావు ఘనంగా సత్కరించిన కొత్తూరు దుర్గమ్మ ఆలయ కమిటీ

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

 

 

విశ్వం వాయిస్ న్యూస్, జగ్గంపేట

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె కొత్తూరు శివారు వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద హిందూ జనశక్తి కాకినాడ జిల్లా అధ్యక్షులు బోధ శివభద్రరావును ఆలయ కమిటీ చైర్మన్ నకిరేడ్డి శివ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులందరూ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ శివ మాట్లాడుతూ సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న బోధ శివభద్రరావు శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారి ఆలయం ఆవరణలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించుకున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు హిందూ ధర్మాన్ని ఆచరించి సన్మార్గంలో నడిచే విధంగా హిందూ గ్రంధాలు సూచిస్తున్నాయని వారు అన్నారు. అనంతరం కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శివ భద్రరావు. 50 సంవత్సరాల చరిత్ర కలిగిన మహిమగల అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ సన్మానం అందుకోవడం నా పూర్వజన్మ సుకృతమని శివ భద్ర రావు అన్నారు. ఈ కార్యక్రమంలో మోటూరు వెంకన్న, బద్ది సురేష్, దంట కామరాజు, అడపా తాతాజీ, మరిసే కృష్ణ, గంప విష్ణు మహేష్, ఆలయ అర్చకులు సోంబాబు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ
సాధారణ వార్తలు
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
సినీ వాయిస్
క్రీడా వాయిస్
ఎడిటర్ వాయిస్
టెక్నాలజీ
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo