WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఆధ్యాత్మిక చింతన ప్రతి వక్కరు అలవాటు చేసుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )

ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు.
మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు బసవేశ్వరుడి 887వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి పుష్పగుచ్ఛాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా
మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు మానవత్వ భావనకు పర్యాయపదమని, మనదేశంలో బుద్ధుడు తర్వాత అంత పెద్ద స్థాయి సంఘసంస్క ఈర్తగా బసవేశ్వరుడు నిలిచారని, అంతకుమించి మానవతావాదం సకల జనుల సమానత్వాన్ని లోకానికి అందించిన మహానీయుడని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వరుని జయంతి వేడుకలు మొట్టమొదటిసారి ప్రభుత్వపరంగా నిర్వహించాలని ఆదేశించి ఉన్నారని ఆ మేరకు జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించామన్నారు. వైశాఖ మాసం, శుక్ల పక్షంలో మూడో రోజున బసవేశ్వరుని జయంతి వస్తుందని ఆయన తెలిపారు. బసవేశ్వరుడు ప్రజలను ఏకం చేసి సమదృష్టితో ఎందరినో ఆకర్షించారన్నారు. లక్షల వచనాలు కూర్చిన ప్రతీతి ఆయనకు ఉందన్నారు. సమానత్వాన్ని లోకానికి అందించిన మహానీయుడని జిల్లా కలెక్టర్ అన్నారు. నిజమైన మానవతావాదని బసవేశ్వరుడు అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడ్డాడని, బ్రాహ్మణ వైదిక సంప్రదాయంలోకి ప్రవేశించిన చెడులపై పోరాడారన్నారు. పరమాత్మ ఒక్కడే అని, అది శివుడని బోధించేవాడన్నారు.
బసవేశ్వరుని తత్వశాస్త్రం మరియు బోధనలు విశ్వవ్యాప్త ఆకర్షణ, శాశ్వతమైన విలువను కలిగి ఉన్నాయన్నారు. ఇది మిలియన్ల మంది ప్రజలను ఆకర్షించిందన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వినబడని లింగ సమానత్వం మరియు సామాజిక న్యాయం, కన్నడ సమాజంలోని అట్టడుగు స్థాయిలో బసవన్న ద్వారా పరిచయం చేయబడిందన్నారు.
బసవన్న రచించిన వచనం సార్వత్రిక సౌభ్రాతృత్వ విలువలను, సామాజిక అవగాహనను ప్రచారం చేసి, సమాజంలో సమానత్వాన్ని లక్ష్యంగా చేసుకుందన్నారు. వచన అనేది కన్నడ సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన ఒక గద్య రూపం – ఉపనిషత్తుల మహావాక్యాల వంటి కొన్ని పదాలలో గొప్పను బోధిస్తుందన్నారు. భగవాన్ బసవ ఒక సంఘ సంస్కర్త, తత్వవేత్త, సమాజంలోని కుల వ్యవస్థ మరియు హిందూ మతం యొక్క ఆచార వ్యవహారాల వంటి సామాజిక దురాచారాలపై పోరాడారన్నారు. కులం, సామాజిక స్థితి, లింగం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉండవని విశ్వసించేవారన్నారు. కుల రహిత సమాజాన్ని బసవన్న దృఢంగా విశ్వసించారన్నారు. ప్రతి వ్యక్తికి జీవితంలో పైకి రావడానికి సమాన అవకాశాలు ఉండాలని ఆకాంక్షించే వారన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు మాట్లాడుతూ
బసవ నిజమైన మానవతావాదని అతను కరుణ, సోదరభావం మరియు ప్రజాస్వామ్యం వంటి మానవతావాదాన్ని కలిగి ఉన్న ఆధునిక సూత్రాలను విశ్వసించి, బోధించి ఆచరించాడన్నారు. గొప్ప మిషన్‌కు బలం చేకూర్చడానికి, అతను అనుభవ మంటపాన్ని రూపొందించాడన్నారు – ఆధ్యాత్మికవేత్తలు, సాధువులు, లింగాయుత విశ్వాసం యొక్క తత్వవేత్తల అకాడమీ మరియు సాధారణ మానవ విలువలు, నైతికతపై ఆలోచనలకు మూలాధారంగా పనిచేశాడన్నారు. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా పార్లమెంటు భావనను ప్రవేశపెట్టిన వ్యక్తి బసవన్న అన్నారు. జీవితంలో వారి వృత్తితో సంబంధం లేకుండా మతపరమైన సాధన లేదా ఆధ్యాత్మిక అభివృద్ధికి సమాన అవకాశాలు ఉండేలా ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలని బసవన్న కలలు కన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వసంతరాయుడు, మున్సిపల్ కమిషనర్ వీఐపీ నాయుడు, ఏవో విశ్వేశ్వరరావు, వాలంటీర్లు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement