WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

ఆలమూరు ( విశ్వం వాయిస్ న్యూస్):

గ్రామ సచివాలయ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రోబేషన్ డిక్లేర్ చేసి పే స్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు కృతజ్ఞతగా పెదపళ్లలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్ చిత్ర పటానికి క్షిరాభిషేకం చేసారు. సొసైటీ చైర్మన్ నెక్కంటి వెంకట్రాయుడు (బుజ్జి), సర్పంచ్ ఏడిద సత్యశ్రీ మెహర్ ప్రసాద్, ఎంపీటీసీ నెక్కంటి ప్రమీల అధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పరిసర గ్రామాల సచివాలయ ఉద్యోగులు పాల్గొని సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేసారు. ప్రభుత్వంలో తమను భాగస్వామ్యం చేసి ఉద్యోగభాద్యతలు అప్పగించి నందుకు సీఎం జగన్ కు జీవితాంతం రుణపడి ఉంటామంటూ ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి చేతుల మీదుగా సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డికి శాలువా కప్పి, పూల మాలలు వేసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు నామాల శ్రీనివాస్, గొడితి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement