WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఢిల్లీలో వరుస భేటీలతో సీఎం జగన్ బిజీబిజీ…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఈ ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం వైయస్‌.జగన్‌.
– సాయంత్రం 4:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి భేటీ.
– దాదాపు 1 గంటా, 20 నిమిషాలసేపు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ
– ప్రధానితో సమావేశానికి ముందు కేంద్రం హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమైన సీఎం. దాదాపు 45 నిమిషాలసేపు హోంమంత్రితో సమావేశమైన సీఎం.
– ప్రధానితో సమావేశం తర్వాత కేంద్రం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు.
– న్యూఢిల్లీ పర్యటనను ముగించుకుని తిరిగి తాడేపల్లికి బయల్దేరిన సీఎం జగన్..

– రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించిన ముఖ్యమంత్రి.
– రాష్ట్ర విభజన సహా అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం విజ్ఞప్తి.
– పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత, విభజన సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలు, కొత్త మెడికల్‌ కాలేజీలకు ఆర్థిక సహాయం తదితర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి.

విశ్వంవాయిస్ న్యూస్, న్యూఢిల్లీ:

దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం జగన్‌.. సుమారు గంటన్నర పాటు చర్చించారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.
అంతకు ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో కూడా భేటీ అయ్యారు. 45 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్ట్‌ నిధులపై కూడా అమిత్‌ షాతో సీఎం జగన్‌ చర్చించినట్లు సమాచారం.
మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రానికి ఆర్థిక సహాయం పోలవరం ప్రాజెక్టు నిర్మాణవ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని, సుదీర్ఘకాలంగా ఇది పెండింగ్‌లో ఉందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన సీఎం.
పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా తీసుకెళ్లేందుకు, తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుందని, ఇది కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉందని ప్రధాని దృష్టికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చారు. పోలవరం తొలిదశ నిర్మాణానికి, కేంద్ర ఆర్థికశాఖ ఇప్పటికే రూ.12911.15 కోట్ల మంజూరు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని, అయితే తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని, ఇది ఇస్తేనే తొలిదశ పూర్తైనట్టని ప్రదానికి వివరించిన సీఎం. మొత్తంగా పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17144 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తిచేసిన సీఎం. ఈమేరకు జలశక్తి శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి.
అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంద నిధులతో ఖర్చుచేసిన రూ.1310.15 కోట్లను వెంటనే రీయింబర్స్‌ చేయాల్సిందిగా కూడా కోరిన సీఎం. ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేయడానికి పై రెండు అంశాలపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తిచేసిన సీఎం.
2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరాచేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిలు అలాగే పెండింగులో ఉన్నాయని పీఎంకు తెలిపిన సీఎం.
ఏపీకి రావాల్సిన రూ.7,230.14 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగులో ఉందని, ఏపీ జెన్‌కో ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులు దృష్ట్యా ఈ బకాయిలు వచ్చేలా దృష్టిపెట్టాలని ప్రధానమంత్రిని కోరిన సీఎం.
జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిన విషయాన్ని మరోసారి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం.
ఏపీకన్నా ఆర్థికంగా ముందువరుసలో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాలకు జాతీయ ఆహార భద్రతాచట్టం కింద కనీసంగా ౧౦ శాతం అధికంగా కవరేజీ ఉందని, పథకం అమలుకు ఎంచుకున్న ప్రమాణాల్లో హేతుబద్ధత లేదని పీఎంకు వివరించిన సీఎం. నీతిఆయోగ్‌ కూడా దీన్ని నిర్ధారించిందని తెలిపిన సీఎం.
రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్రం రేషన్‌ దక్కకుండా పోతోందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోందని, సత్వరమే జోక్యంచేసుకోవాలని ప్రదానమంత్రిని కోరిన సీఎం.
ప్రతినెలా వినియోగించకుండా దాదాపు లక్ష టన్నుల బియ్యం కేంద్రం వద్ద ఉంటోందని, ఇందులో 77వేల టన్నులు రాష్ట్రానికి ఇస్తే సరిపోతుందని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రధానిని కోరిన ముఖ్యమంత్రి.
రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు పెండింగులో ఉన్నాయిన ప్రధాని దృష్టికి తీసుకు వచ్చిన సీఎం.
ప్రత్యేక హోదా సహా… పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలని కోరిన సీఎం.
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ప్రత్యేక హోదా దోహదపడుతుందని, రాష్ట్రం స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, ఈమేరకు సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రధానికి విజ్ఞప్తిచేసిన సీఎం.
రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశామని, ప్రతి జిల్లాకు కనీసంగా 18 లక్షల జనాభా ఉందని ప్రధానికి తెలిపిన సీఎం.
ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టామని వెల్లడించిన సీఎం.
ఈ కాలేజీలకు తగిన ఆర్ధిక సహాయం చేయాలని కోరిన సీఎం.
వైయస్సార్‌ కడప జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణానికి రాష్ట్ర విభజన సందర్భంలో కేంద్ర హామీ ఇచ్చిందని, వెనకబడ్డ రాయలసీమ ప్రాంతంలో జీవనోపాధి మెరుగుపడ్డానికి, జీవన ప్రమాణాలు మెరుగుపడ్డానికి ఈ ప్రాజెక్టు చాలా అవసరమని పీఎంకు తెలిపిన సీఎం.
స్టీల్‌ప్లాంట్‌కు అత్యంత అవసరమైన ముడి ఖనిజంకోసం మూడు గనులను ఏపీ ఎండీసీకి కేటాయించేలా కేంద్ర గనులశాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేసిన సీఎం.
ఏపీ పౌరసరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరుచేయాల్సిందిగా ప్రధానమంత్రిని కోరిన సీఎం.
2012-13 నుంచి రూ. 2017-18 వరకూ ఇవి పెండిగులో ఉన్నాయని తెలిపిన సీఎం. అంతకు ముందు ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి స్వాగతం పలికారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement