విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం పట్టణం:
*జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ సమావేశం*
అమలాపురం వింటేజ్ గ్రాండ్ నందు జిల్లా అధ్యక్షుడు వడ్డీ నాగేశ్వరరావు అధ్యక్షతన
అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్
. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా సమావేశం జరిగినది . ఈ సమావేశం అమలాపురం వింటేజ్ గ్రాండ్ లో సాయంత్రం మూడు గంటలకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా సమావేశం జరిగినది. ఈ సమావేశం జిల్లా అధ్యక్షులు వడ్డి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో పూర్తి వైభవం తీసుకురావాలని ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమాన్ని గాలికి వదిలేసాయని ఎస్సిల వాడిననే అని ప్రచారం చేసుకుంటున్నా మన ముఖ్యమంత్రి జగన్ ను మెడికల్ కాలేజీలో రిజర్వేషన్ తీసివేసారని ఇది చాలా బాధాకరమని పేర్కొన్నారు. అదేవిధంగా మణిపూర్ సంఘటన కూడా నాయకులు ఖండించారు .మరియు మండలస్థాయి కమిటీలు వేయాలని అధ్యక్షుడిని కోరటమైనది ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఎస్సీ డిపార్ట్మెంట్ డాక్టర్ దేవరపల్లి రాజేంద్ర బాబు మాట్లాడుతూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి దళితులు క్రిస్టియన్స్ ముస్లింలు ఓటు వేయకపోతే మూతికి ముంతకు తాటాకుకు ఎంతో దూరంలో లేదని ఆయన వాపోయారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చాలని రాష్ట్ర కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎసిసి మెంబర్ యార్లగడ్డ రవీంద్ర ,మండపేట కన్వీనర్ గడ్డం సురేష్ బాబు, ,పిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కోఆర్డినేటర్ చిలకపాటి శ్రీధర్ ,పిసిసి డెలిగేట్స్ ధోనిపాటి విజయలక్ష్మి, అయితాబత్తుల సుభాషిణి,మండల ప్రెసిడెంట్ గోడి భాస్కరరావు ,మండల ప్రెసిడెంట్ ఎన్ వెంకటరమణ, మండల ప్రెసిడెంట్ గెడ్డం వెంకటేశ్వరరావు, ఎస్సీ సెల్ నీతిపూడి బాల సత్యనారాయణ, ఎస్సీ సెల్ పులుసుగంటి ప్రకాష్, సమన్వయ కమిటీ రాజోలు సరెల్ల ప్రసన్నకుమార్,సాదనాల సత్యనారాయణ, రాయుడు గంగాభవాణి, వస్కా బాబు, అయితాబత్తుల కుమార్ సింగ్ పిళ్లి అప్పన్న, మగ్గం జాకప్పరాజు తదితరులు పాల్గొన్నారు .ఇట్లు. జిల్లా అధ్యక్షుల. వడ్డి నాగేశ్వరరావు.