విశ్వంవాయిస్ న్యూస్, అయినవిల్లి మండలం:
మహిళల దశ మార్చేది తెలుగుదేశం పార్టీనే : హరీష్ బాలయోగి
ముంగండ గ్రామం మహాశక్తి కార్యక్రమం లో
అయినవిల్లి మండలం విశ్వం వాయిస్ న్యూస్
ఇంటికే పరిమితమైన మహిళలను చైతన్యవంతులను చేసి ఆస్తి హక్కులో భాగం ఇచ్చి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మహిళల దశను మార్చింది తెలుగుదేశం పార్టీనే అని పి.గన్నవరం నియోజకవర్గం కన్వినర్,అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ జియం హరీష్ బాలయోగి అన్నారు.పి.గన్నవరం నియోజకవర్గంలోని ముంగండ గ్రామంలో ఈరోజు జరిగిన మహాశక్తి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోనే మహిళలకు గౌరవం,ఆర్దిక పరిస్థితి మెరుగుపడిందని,ఆస్తి హక్కు,రాజకీయాలలో రిజర్వేషన్ లు కల్పించడమే కాకుండా డ్వాక్రా,స్వశక్తి వంటి కార్యక్రమాలతో మహిళల స్థాయిని పెంచింది తెలుగుదేశం పార్టీనే అని గుర్తు చేశారు.ఇప్పుడు మహాశక్తి కార్యక్రమంతో మహిళలకు మరింత వృద్ధి చేకూర్చేందుకు నారా చంద్రబాబునాయుడు అనుక్షణం తపిస్తున్నారని అన్నారు.తల్లికి వందనం,ఇంటింటికీ త్రాగునీరు,ఆడబిడ్డ నిధి,ఉచిత బస్సు ప్రయాణం,ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి వాటితో ఆడపడుచులకు అన్నగా అండగా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ పధకాల అమలుతో మహిళలందరూ మహారాణులుగా మారే పరిస్థితిని తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని హరీష్ బాలయోగి భరోసా ఇచ్చారు.అనంతరం గ్రామంలో ఇంటింటికీ తిరిగి మహాశక్తి పధకాలను మహిళలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.