చనిపోయిన అంగనవాడి వర్కర్ శాంతి కుమార్ కి నివాళులర్పించిన అంగన్వాడీలు
మెయిన్ రోడ్ లో రాస్తారోకో
విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
విశ్వం వాయిస్ రామచంద్రపురం రాష్ట్రంలో జరుగుతున్న నిరోధిక నిరాహారదీక్షలకి మద్దతుగా రామచంద్రపురం లో రిలే దీక్షలు 2వ రోజు కొనసాగిస్తూ రామచంద్రపురం సీఐటీయూ ఆధ్వర్యంలో రామచంద్రపురం,కె గంగవరం మండలాల అంగనవాడిలు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ధర్నాలో కూర్చున్నారు.ఈ ధర్నా లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూకల బలరామ్,అంగనవాడి జిల్లా కార్యదర్శి యం.దుర్గమ్మ,ప్రాజెక్టు అధ్యక్షురాలు వి.వీరలక్ష్మి,అద్వర్యం లో 19 జనవరి శుక్రవారం ఉదయం 9:30 గంటల నుండి అంగన్వాడీలు దీక్షా శిబిరంకి చేరిన్నారు.రాష్ట్రంలో నిరవధిక నిరాహార దీక్షలు నాలుగో రోజు కి చేరుకున్నాయి.వారికి మద్దతుగా ఇక్కడ రిలే దీక్షలో కూర్చున్నారు.మొదటిగా హార్ట్ స్ట్రోక్ తో చనిపోయిన శాంతి కుమారి కి నివాళులర్పించడం జరిగింది.ఈ రాస్తారకోలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూకల బలరాం మాట్లాడుతూ ఈ హత్య ప్రభుత్వ హత్య అని, చనిపోయిన వర్కర్ కి 50 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని,ఆమె కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 11 మంది చనిపోయారని ఈ హత్యలకి కారణం ప్రభుత్వమేనని అన్నారు.న్యాయమైన డిమాండ్స్ కోసం అంగన్వాడీలు 40 రోజుల నుంచి సమ్మె చేస్తున్న ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా సిఐటియు అనుబంధ సంఘాలు మెయిన్ రోడ్ లో రాస్తారోకో చేయడం జరిగింది.ఇప్పటికైనా ప్రభుత్వం వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని లేనియెడల పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు.సమ్మెలో అంగనవాడి నాయకులు వాసంశెట్టి సూర్యకుమారి,కె.విజయలక్ష్మి,జి శ్రీదేవి, కె.జహరా,కె దుర్గ,జి వెంకటరత్నం,ఈ గోంతి దేవి,వీర వేణి,మరియు రెండు మండలాల అంగన్వాడి వర్కర్స్,హెల్పర్స్ పాల్గొన్నారు.