విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓదూరు గ్రామంలో సాయిబాబా గుడి వద్ద కాకినాడ నుండి రావులపాలెం వెళుతున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ,మోటార్ సైకిల్ పై రామచంద్రపురం వైపు వెళుతున్న వ్యక్తిని ఢీకొనగా బండిపై ప్రయాణం చేయుచున్న అతని భార్య అయిన చింతకాయల కనకమహాలక్ష్మి W/o శ్రీనివాస్ 45 శెట్టిబలిజ విద్యుత్ నగర్ కాకినాడ చెందిన ఆమె ప్రమాదంలో అక్కడికక్కడే మరణించగా,వారి మనవడైన ఒక సంవత్సరం బాబుకి గాయాలు అవగా కాకినాడ హాస్పటల్ తరలించారు. రామచంద్రపురం పోలీస్ వారు ప్రమాద స్థలానికి వెళ్లి మృతదేహాన్ని మార్చరీకి తరలించి దర్యాప్తు చేయుచున్నారు