విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
పాఠశాల తనిఖీ చేసిన విద్యాశాఖ అధికారి
రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ ద్రాక్షారామ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఎస్ ఎల్ నరసింహ ఫణి
స్థానిక జల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ద్రాక్షారామను జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ఎస్ ఎల్ నరసింహ ఫణి ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. పాఠశాల పరిసరాలను పరిశీలించి మురుగునీరు వెళ్ళడానికి మరిన్ని సక్రమ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు మధ్యాహ్న భోజన పథకంలో ప్రతి విద్యార్థి పాఠశాలలోనే భోజనం చేసేలా ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది.పాఠశాలలో అడ్మిషన్ల శాతం పెంచడానికి స్థానికంగా ఉండే ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు డివిజన్లోనే అత్యధికమైన విద్యార్థులు కలిగిన పాఠశాల ద్రాక్షారామం ఉన్నత పాఠశాల ఆ రికార్డును అలాగే కొనసాగించేలాగా ఉపాధ్యాయులు అందరూ కృషి చేయాలని సూచించారు కృత్యాధార బోధనలో మాత్రమే పాఠ్యాంశ బోధన జరిగేలా కృషి చేయాలని ప్రతి ఒక్కరిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించి మరింత ఉన్నత ప్రమాణాలు సాధించే విధంగా పలు సూచనలు చేయడం జరిగింది.ఈ పర్యటనలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రత్న పద్మావతి, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, సీనియర్ ఉపాధ్యాయులు ఉమాపతి శాస్త్రి మరియు ఆరవ విశ్వేశ్వరరావు కోడి ప్రసాద్ పాల్గొన్నారు.