WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

బంగారు పతకాలతో మెరిసిన మోడరన్ విద్యార్థి 

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

బంగారు పతకాలతో మెరిసిన మోడరన్ విద్యార్థి

 

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ ఈ నెల 7,8 తేదీలలో కొత్తపల్లి సత్యనారాయణ మెమోరియల్ తరపున తూర్పుగోదావరి బాడ్మింటన్ సెలక్షన్ కమ్ టోర్నమెంట్ 2024 రాజమండ్రిలో జరిగింది.ఈ పోటీలలో పాల్గొన్న మోడరన్ విద్యా సంస్థలలో 10వ తరగతి చదువుతున్న బోను అభిషేక్

అద్భుతమైన ప్రతిభతో మూడు గోల్డ్ మెడల్స్ సాధించి శభాష్ అభిషేక్ అనిపించుకున్నాడు.అండర్ 17 లో సింగిల్ విన్నర్, అండర్ 17డబుల్స్ విన్నర్,అలాగే అండర్ 19 లో కూడా డబుల్స్ విన్నర్ గా నిలిచి క్రీడాభిమానుల ప్రశంసలు అందుకున్నాడు. ఈసందర్బంగా మోడరన్ విద్యాసంస్థల అధినేత లయిన్ జి.వి.రావు, హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎం.చిట్టిబాబు అభిషేక్ ని అభినందించారు.ఈ సందర్బంగా మోడరన్ అధినేత జి.వి.రావు మాట్లాడుతూ..విజేతకు మారుపేరుగా విజయానికి మరో పేరుగా దూసుకునివెళ్తున్న అభిషేక్ భవిష్యత్ లో దేశం గర్వించే క్రీడాకారుడు అవుతాడని అన్నారు. అభిషేక్ మాట్లాడుతూ… తల్లిదండ్రుల ప్రోత్సాహం, మోడరన్ విద్యాసంస్థల సహకారం తన విజయంలో కీలక భూమిక పోషిస్తున్నాని అన్నాడు. కార్యక్రమంలో మోడరన్ స్టాఫ్ పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement