రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే వైఎస్.జగన్మోహన్ రెడ్డిదే…
డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐ.టి.వింగ్ అధ్యక్షులు యరమాటి వెంకన్నబాబు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కృషి చేసింది వైయస్.జగన్మోహన్ రెడ్డి అని మరొక్కసారి నిరూపనైందన్నారు. 2024ఎన్నికలకు ముందు కూటమి నాయకులు అధికారం కోసం రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోయి అధికారం వచ్చి సంవత్సరకాలం దాటినా, రైతులు అప్పులు పాలైపోయినా పట్టించుకోకుండా ఇప్పుడు 5వేలు వేసి ఏదో ఘనకార్యం చేసినట్లు ఆర్భాటాలు చేసుకోవడం ఈ కూటమి ప్రభుత్వ ప్రతినిధులుకు మాత్రమే చెల్లిందన్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ రైతులకు ఏడాదికి రూ.12,500 చొప్పున 4 ఏళ్లు సాయం చేస్తానని హామీ ఇచ్చారని చెప్పినదాని కంటే ఒక ఏడాది ఎక్కువ పెంచడమే కాకుండా రూ.1,000 పెంచి ఏడాదికి రూ.13,500 చొప్పున 5ఏళ్లలో రూ.34,288 కోట్లు ఆర్ధిక సహాయం అందించిన ఘనత జననేత జగన్ దే అన్నారు. మండపేట నియోజకవర్గంలో 18,229 మంది రైతులకు గత ఏడాది 2024-2025 కాలంలో ఇస్తానని ఇవ్వకుండా కాలయాపన చేసిన రూ.36కోట్ల 45 లక్షల 80వేలు ఎప్పుడిస్తారో పత్రికాముఖంగా రైతులకు చెప్పాలని యరమాటి వెంకన్నబాబు డిమాండ్ చేశారు.