20 October 2025
Monday, October 20, 2025
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

అంబేద్కర్ కోనసీమ

పర్యావరణ హితమైన దీపావళి జరుపుకుందాం

చిత్రలేఖనం ద్వారా విద్యార్థుల సందేశం డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ సూచనలు విశ్వం వాయిస్ న్యూస్, మండపేట దీపావళి శుభాకాంక్షలు తెలిపుతూ మండపేట ఎంపిఎస్ పాఠశాల విద్యార్థుల పటాకుల వాడకాన్ని తగ్గించి కుటుంబంతో కలిసి దీపాలు వెలిగించి శాంతియుతంగా పండుగని జరుపుకోవాలని సందేశాత్మక చిత్రాల ద్వారా తెలిపారు. రాబోయే తరాలకు కాలుష్యం కలిగించని దీపావళి గురించి పరిచయం చేయాలని, అలాంటి దీపావళి మొదట మనం ఆచరించి, తదుపరి తరాలకు తెలపాలని సందేశమిస్తూ మండపేట పబ్లిక్ స్కూల్ డ్రాయింగ్ మాస్టర్ సౌదాగర్ తన విద్యార్థులతో దీపావళి సందర్భంగా వేయించిన చిత్ర లేఖనాలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సౌదాగర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించని దీపావళి మన పూర్వీకులు ఆచరించారని, లక్ష్మీ పూజలు,పిండి వంటలు, దీపాల వరుసలతో ప్రతి...

పక్కదారి పడుతున్న దీపం లక్ష్యం

వ్యాపార కార్యకలాపాలకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు కళ్ళెదుట కనబడుతున్నా కళ్ళు మూసుకుంటున్న యంత్రాంగం సరఫరాదారులు సిలిండర్ కు అధికంగా వసూలు చేస్తూ, బ్లాక్ లో సరఫరా చేస్తున్నారని విమర్శలు ప్రమాదంగా మారకముందే మేలుకోవాలని ప్రజల హితవు విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులను తగ్గించి, వారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పేర్కొన్న విధంగా సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, దీపం పధకం ద్వారా పేద,మద్య తరగతి ప్రజలు నిత్యం వినియోగించే వంట గ్యాస్ ను సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా అందిస్తూ సహాయ పడుతున్నప్పటికీ, గృహ అవసరాల నిమిత్తం వినియోగించవలిసిన డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. పేద,...

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్ పర్సన్ రాణి…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట పట్టణ ప్రజలందరికీ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పతివాడ నూక దుర్గారాణి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం దీపావళి పండుగ సందర్భంగా ప్రజలంతా పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆమె ఆకాక్షించారు.చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారన్నారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లోనూ సరికొత్త వెలుగులు నింపాలని ఆమె ఆకాంక్షించారు.

ఘనంగా ధన్వంతరి జయంతి…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట కమ్యూనిటీ పారామెడిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ పియంపి అసోసియేషన్ ఆద్వర్యంలో ధన్వంతరి జయంతి శనివారం నిర్వహించారు. జిల్లా పీఎంపీ అద్యక్షులు కోన సత్యనారాయణ ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ దేశంలో ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉన్న వైద్యం ఆయుర్వేద వైద్యం అని పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని ఎందరో మహానుభావులు సాధన చేసి అందులో నిష్ఠాతులయ్యారన్నారు. దీనికి మూలపురుషుడుగా భావించే ధన్వంతరి మానవులకు ఆయుర్వేద జ్ఞానాన్ని అందించాడన్నారు. సూర్య భగవాన్ వద్ద ఆయుర్వేదం నేర్చుకున్న ధన్వంతరి 16 మంది శిష్యుల్లో ఒకడని చెప్పారు. దీపావళికి ముందు వచ్చే ఆశీయుజ బహుళ త్రయోదశి రోజు ఆరోగ్యానికి...

రాయవరం లో విద్యుత్ సరఫరా కు అంతరాయం

విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రాయవరం రాయవరం సబ్ స్టేషన్ పరిధిలో రాయవరం 11కెవి టౌన్ 2, మాచవరం ఫీడర్ల పరిధిలో మరమ్మత్తుల నిమిత్తం రాయవరం,మహేంద్రవాడ,మాచవరం గ్రామాలకు అక్టోబర్ 18 శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని రామచంద్రపురం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు శుక్రవారం తెలిపారు. దీనికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

మాధవి స్పోర్ట్స్ క్లబ్ ఆరంభం….

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట క్రీడలను ఎప్పుడు ప్రోత్సహించే మాధవి ఆయిల్స్ అధినేత వేగుళ్ళ కృష్ణ చైతన్య బాబు స్థానిక విజయలక్ష్మి నగర్ శివారు బైపాస్ రోడ్డు నందు యువతకు ఉపయోగకరమైన మాధవి స్పోర్ట్స్ బాక్సులను బుధవారం నాడు ప్రారంభించారు. ఇందులో రెండు క్రికెట్ కోర్టులు, ఒక శెట్టిల్ కోర్టు, ఒక వాలీబాల్ కోర్ట్ ,ఒక పింక్ బాల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత ఆరోగ్యం పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోజుకి ఒక గంటపాటైన ఆరోగ్యం పట్ల దృష్టి సారించి కసరత్తులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వేగుళ్ల పట్టాభి రామయ్య చౌదరి, వేగుళ్ల రేణుకాదేవి, వల్లూరి కుమార్ బాబు, వల్లూరి రామన్న...

విస్పోటనం జరిగి వారం, బాధితులకు ఏది పరిహారం.?

యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పదిమంది కార్మికుల మృతి అండగా ఉంటామని నాయకుల నోటిమాట, అర్థం కాని కూటమి ప్రభుత్వ పోకడ శనివారం లోపు పరిహారం ప్రకటించక పోతే, బాధిత కుటుంబాలతో కలిసి ఉద్యమం బాట. పీ.డీ.ఎస్.యూ, ఏ.ఐ.కె.ఎం.ఎస్, ఎం.ఆర్.పి.ఎస్., ఎస్.సీ, బీ.సీ, మైనార్టీ ప్రజా సంఘాల హెచ్చరిక విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం గ్రామ శివారులో శ్రీ గణపతి ఫైర్‌వర్క్స్ బాణాసంచా తయారీ కర్మాగార కేంద్రంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకమని, ఘటన జరిగి వారం రోజులు గడిచినా నష్టం పరిహారం పై ప్రకటన లేని ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీ.డీ.ఎస్.యూ, ఏ.ఐ.కె.ఎం.ఎస్., ఎం.ఆర్.పి.ఎస్.,...

మాకెందుకులే అనుకుంటే మీకే ప్రమాదం

చిన్న పాటి నిర్లక్ష్యం పెను ప్రమాదాన్ని సృష్టిస్తుంది. ఇంటి వద్ద దీపావళి సామాగ్రి తయారీ చేసే ఆలోచన వద్దు జనావాసాల్లో దీపావళి సామాగ్రి నిల్వ, అమ్మకాలను సహించేది లేదు. ఎంతటి వారైనా నిస్సందేహంగా కేసులు నమోదు చేస్తాం... ప్రమాదం జరిగాక పొందే ఆవేదన కంటే, ముందుగా మేల్కొనే జాగ్రత్త మేలు. మండపేట రూరల్ సిఐ పి.దొరరాజు. విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం దీపావళి పండుగ నిమిత్తం మందుగుండు సామాగ్రిని సొంతంగా తయారుచేసే ఆలోచన పెట్టుకోవద్దని ఈ విషయంలో చిన్న పాటి నిర్లక్ష్యాన్ని కూడా సహించబోమని  మండపేట రూరల్ సిఐ పి. దొర రాజు మంగళవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్ళల్లో దీపావళి బాణాసంచా సామాగ్రి నిల్వ చేసినా, తయారు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని, నిస్సందేహంగా...

మాజీ చైర్మన్ ప్రకాష్ పరామర్శ…

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, మండపేట మండపేట 12 వార్డు లో ఇటీవల మృతి చెందిన బీరక వీర మల్లయ్య కుటుంబ సభ్యుల ను మాజీ మునిసిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్ సోమవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలచర్ల బ్రహ్మాజీ, యర్రమాటి సత్యనారయణ, సిరంగి ఈశ్వర్ రావు, దొంత్తం శెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు

అగ్నిప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు మృతి

చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన చిట్టూరి యామిని,లింగం వెంకట కృష్ణ విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం మండల కేంద్రమైన రాయవరంలో ఇటీవల బాణాసంచా కర్మాగారంలో జరిగిన విస్ఫోటనం లో మృతుల సంఖ్య పదికి చేరింది. సంఘటన లో తీవ్రంగా గాయపడి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందుతున్న తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం,అనపర్తి సావరం కి చెందిన చిట్టూరి యామిని, కాకినాడ జిల్లా, పెదపూడి మండలం, వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ (చినబాబు) లు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ప్రాధమిక సమాచారం. ప్రమాద తీవ్రత తో ఘటనా స్థలంలోనే నిర్వహకునితో కలిపి ఆరుగురు సజీవదహనం కాగా, గాయపడిన నలుగురు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందడం ఆవేదన కలిగించే విషయం.
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo