కమ్యూనిటీ పారామెడిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ పియంపి అసోసియేషన్ ఆద్వర్యంలో ధన్వంతరి జయంతి శనివారం నిర్వహించారు. జిల్లా పీఎంపీ అద్యక్షులు కోన సత్యనారాయణ ధన్వంతరి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ దేశంలో ప్రాచీన కాలం నుంచి అందుబాటులో ఉన్న వైద్యం ఆయుర్వేద వైద్యం అని పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని ఎందరో మహానుభావులు సాధన చేసి అందులో నిష్ఠాతులయ్యారన్నారు. దీనికి మూలపురుషుడుగా భావించే ధన్వంతరి మానవులకు ఆయుర్వేద జ్ఞానాన్ని అందించాడన్నారు. సూర్య భగవాన్ వద్ద ఆయుర్వేదం నేర్చుకున్న ధన్వంతరి 16 మంది శిష్యుల్లో ఒకడని చెప్పారు. దీపావళికి ముందు వచ్చే ఆశీయుజ బహుళ త్రయోదశి రోజు ఆరోగ్యానికి సంపదకు ప్రతీకైన ధన్వంతరిని పూజించడంవల్ల ఆరోగ్యం దీర్ఘాయువు సంపద కలుగుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎంపీ జిల్లా గౌరవ అధ్యక్షులు బళ్ల వెంకటరమణ, మండల ప్రధాన కార్యదర్శి ఇరవాడ రవికుమార్, మండల కోశాధికారి వానపల్లి కనకరాజు,మండిపూడి చంద్రశేఖర్, పొన్నాడ శ్రీనివాస్,ఇందన వెంకటేశ్వరరావు,ఇరవాడ ఏడుకొండలు, శ్రీను, నరేష్, గాలింకి నాగేశ్వరరావు,సతీష్, శ్రీను,పియంపిలు పాల్గొన్నారు.