Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మీ కోసమే చెబుతున్నా.. గేర్ మార్చి స్పీడ్ పెంచండి… సిఎం జగన్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఏపీలో రాజకీయ రూమర్లను కొట్టిపారేసిన సీఎం జగన్‌.
షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం.
రాబోయే కాలంలో రూమర్లు ఇంకా వస్తాయని వ్యాఖ్య.
ఎమ్మెల్యేలంతా క్రియాశీలకంగా ఉండాలి…
ఏ ఒక్క ఎమ్మెల్యే ని ఒదులుకోం, అందరిని గెలిపించుకుంటాం.
ఎమ్మెల్యేలంతా సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోవాలి.
మంత్రి వర్గ మార్పులు, కూర్పులు లేవు. యెల్లో మీడీయా చేస్తున్న విష ప్రచారాలని తిప్పి కొట్టండి.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై సీఎం కామెంట్స్ చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు. 21 స్థానాల్లో ఎన్నికలు జరిగితే 17 స్థానాల్లో మనం గెలిచాం.
మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు…

విశ్వంవాయిస్ న్యూస్, అమరావతి:

అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో.. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై.. వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడప గడపకూ కార్యక్రమాన్ని మళ్లీ ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలని.. గేర్‌ మార్చి రెట్టించిన స్పీడ్‌తో ప్రజల్లోకి వెళ్లాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. లేకపోతే నష్టం తప్పదని వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 13న గడప గడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశామని.. దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్‌ వచ్చిందని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మళ్లీ ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేపట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా గ్యాప్‌ వచ్చిందని.. మార్చి 16వరకూ కోడ్‌ కొనసాగిందని చెప్పారు. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయని.. ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయని.. వీటి వల్ల గడప గడపకూ కాస్త గ్యాప్‌ వచ్చిందని వివరించారు. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, నియోజకవర్గాల ఇంఛార్జ్‌లతో భేటీ అయిన జగన్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

‘రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా.. నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2 లక్షల కోట్ల పైచిలుకు మన అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో పడింది. అర్బన్‌ ప్రాంతంలో 84 శాతం, రూరల్‌ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు.. యావరేజీన 87 శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం. ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు. 87 శాతం కుటుంబాలను గమనిస్తే.. అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం. పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్‌ చేసి మరీ వారికి పథకాలు అందిస్తున్నాం’ అని జగన్ వ్యాఖ్యానించారు.
‘గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలను అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం. బీపీఎల్‌ నిర్వచనాన్ని మారుస్తూ.. గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10 వేలకు, అర్బన్‌ ప్రాంతాల్లో రూ.12 వేలకు పెంచి పథకాలు అందిస్తున్నాం. ఇలా చేస్తే 87 శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నాం’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరించారు.

‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని చంద్రబాబు ఏదో మాటలు చెప్తున్నారు. 21 స్థానాల్లో ఎన్నికలు జరిగితే.. 17 స్థానాల్లో మనం గెలిచాం. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు. కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి. వారు వాపును చూపించి.. అది బలం అని ప్రచారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు. 60 మందికి టిక్కెట్లు ఇవ్వబోనని లిస్టు కూడా తయారు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

‘ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. వారంతా గజ దొంగల ముఠా. దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండి పడింది. అందుకే గజదొంగల ముఠా ఇవన్నీ చేస్తుంది. రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి.. వాటిని తిప్పికొట్టాలి’ అని జగన్ స్పష్టం చేశారు.
సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం. కేడర్‌ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి. సోషల్‌ మీడియాను బాగా వినియోగించుకోవాలి. సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలి. గృహ సారథులను, సచివాలయ కన్వీనర్లు.. వ్యవస్థను పూర్తి చేసుకోవాలి. ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలి. వాలంటీర్లను, గృహ సారథులను ఏకం చేయాలి. వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్నమంచిని తీసుకెళ్లాలి’ అని జగన్ దిశా నిర్దేశం చేశారు.

‘దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడప గడపకూ పూర్తి చేశాం. ఈ సగం వచ్చే 5 నెలల్లో.. అంటే ఆగస్టు నాటికి పూర్తి చేయాలి. నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి. సెప్టెంబర్ నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం. ఒకవైపు గడప గడపకూ జరుగుతుంది. రెండో వైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయి. వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నాం’ అని జగన్ వివరించారు.
ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు. అంటే ఎమ్ముల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది. ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు. వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేశామో వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువ. కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు. ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుంది? అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

‘రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను. ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను. మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే.. ఈ కార్యక్రమాలు. ఈ అడుగులన్నీ కూడా దానికోసమే. కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్షలమంది మనపై ఆధారపడి ఉన్నారు. ప్రజల్లో మీ గ్రాఫ్‌ సరిగ్గా లేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం’ అని జగన్ స్పష్టం చేశారు.
‘మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు. అందుకే మన గ్రాఫ్‌ పెంచుకోవాలి. ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి. అందుకే గడప గడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి. ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్‌ పెరుగుతుంది. నేను చేయాల్సింది.. నేను చేయాలి.. మీరు చేయాల్సిది మీరు.. చేయాలి. ఈ రెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం. ఈ నెల 13న జగనన్నకు చెబుదాం కార్యక్రమం ప్రారంభం కాబోతోంది’ అని జగన్ వివరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement