Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఘనంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. మండలం వెదురుపాక విజయ దుర్గా పీఠం 51 వార్షికోత్సవంలో మూడవరోజు శుక్రవారం ఉదయం సీతారామచంద్రమూర్తి పట్టాభిషేకం , శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. వేద పండితులు సీతారామచంద్రమూర్తి పట్టాభిషేకాన్ని శాస్త్రవేత్తంగా నిర్వహించారు. ఈ పట్టాభిషేక మహోత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు పాల్గొని స్వామి అమ్మవార్లకు వెండి పుష్పాలతో అర్చన నిర్వహించారు.సాయంత్రం వైఖానస పండితులు బాలాజీ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొలుతగా విజయదుర్గా అమ్మవారికి అభిషేకాలు, లక్ష గులాబీ అర్చన, లక్ష కుంకుమార్చన నిర్వహించారు.ఈ సందర్భంగా పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం ( గాడ్) ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ సీతారామచంద్రమూర్తి పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించిన వారికి, వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వీక్షించిన వారికి సకల శుభాలు చేకూరి, అష్టైశ్వర్యాలు ,శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతారని శుభాశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వివి బాపిరాజు ,విజయ దుర్గా సేవా సమితి సభ్యులు గాదె భాస్కర నారాయణ ,సత్య వెంకట కామేశ్వరి ,సత్య కనకదుర్గ, బి .రమ్య, రాష్ట్రం నలుమూలల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు. పి ఆర్వో వాడ్రేవు వేణుగోపాల్ (బాబి) ఆధ్వర్యంలో భారీ అన్న ప్రసాద వితరణ గావించారు. భక్తులు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement