WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

వైసీపీ పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాలు… మండపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు విత్తనాల వాణిశ్రీదేవి…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

వైసీపీ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు విత్తనాల వాణిశ్రీదేవి అన్నారు.
మండలం మాచవరం గ్రామములో ఆదివారం  భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా “మహాశక్తి” కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ భవిష్యత్తుకి గ్యారెంటి కార్యక్రమంలో భాగంగా “మహాశక్తి” కార్యక్రమ కరపత్రాలను అందజేసినారు. ఈ సందర్బంగా విత్తనాల వాణిశ్రీదేవి మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాతకి ఏడాదికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం, ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు ఏడాదికి 15 వేల రూపాయలు, యువగళం ద్వారా ప్రతి నిరుద్యోగికి 3వేల రూపాయల నిరుద్యోగ భృతి, మహిళలు అందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఇంటి ఇంటికి సురక్షిత మంచినీటి పథకం తదితర పథకాల గురించి ఇంటిఇంటికి తెలుగుదేశం పార్టీ మహిళలు, నాయకులు తిరుగుతూ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు విత్తనాల వాణిశ్రీదేవి, సాధికారిక మహిళా కమిటీ సభ్యురాలు వలి జానీ, రోజా రాణి, గుత్తుల వెంకటలక్ష్మి, మద్దిరెడ్డి కృష్ణవేణి, తోట లక్ష్మి, గుత్తుల వెంకట సూర్య కుమారి, నియోజకవర్గ ఎస్సి సెల్ ఉపాధ్యక్షురాలు పులిదిండి లక్ష్మి, గ్రామ మహిళా ప్రధాన కార్యదర్శి కటకం మహాలక్ష్మి, సబ్బేళ్ల వెంకన్న బాబు, రిమ్మలపూడి వేణుగోపాల్ దొర, నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి వెంకన్నబాబు, మేడపాటి రవీంద్రారెడ్డి, రిమ్మలపూడి సత్యనారాయణ, కోడి చిన్నప్పరావు, గండి చంద్రశేఖర్, మల్లిడి ఆదినారాయణ రెడ్డి, కొవ్వూరు కృష్ణారెడ్డి, గొల్తి అంజి, త్రీపర్తి శ్రీ రమేష్, నెల్లి రాము, దాసరి శ్రీనివాస్, ఉండవల్లి రాంబాబు, వడ్డాది కృష్ణంరాజు (పండు ), సత్తి శ్రీనివాసరెడ్డి, కాదా నాగరాజు, వాసంశెట్టి వెంకటేష్, నేతల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement