WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

బదిలీ అయిన ఎస్‌ఐ సురేష్ కి పౌర సన్మానం… విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నత పదవులు అధిరోహించాలి.. సబ్ డివిజనల్ అధికారి టి ఎస్ ఆర్ కే ప్రసాద్ ..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

బాధ్యతాయుతమైన సేవలందించి సురేష్ ప్రజా మణులు పొందుతారని సబ్ డివిజనల్ అధికారి టి ఎస్ ఆర్ కే ప్రసాద్ పేర్కొన్నారు.
రాయవరం మండలం ఎస్సైగా పనిచేసి నగరం పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లిన పి వి ఎస్ ఎస్ ఎన్ సురేష్ కు ఆదివారం రాత్రి పౌర సన్మానం జరిగింది. ప్రస్తుత ఎస్సై జి. నరేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డి.ఎస్.పి ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బాధ్యతాయుతమైన సేవలందించి సురేష్ ప్రజా మణులు పొందారన్నారు సుమారు మూడు సంవత్సరాలు ఒక స్టేషన్లో పని చేయడమే అందుకు తార్కాండమన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ సిరిపురం శ్రీనివాసరావు, ఎంపీపీ నౌడు వెంకటరమణ, ప్రముఖ పారిశ్రామికవేత్తలు తేతల సుబ్బరామారెడ్డి, కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి (ఎర్రసత్తిబాబు), మండపేట సీఐ కె .శ్రీధర్ తదితరులు ఎస్సై సురేష్ విధి నిర్వహణలో చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ఎస్సై సురేష్ దంపతులకు ఘన సత్కారం చేశారు. అలాగే బదిలీపై వెళ్లిన ఎన్. కోటేశ్వరరావు (కోటి), బి వి వి సత్యనారాయణ(సత్తిబాబు), పి .రాజులను కూడా ఘనంగా సన్మానించారు. వారు సుమారు ఏడు సంవత్సరాల పాటు అందజేసిన సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గంటి రోజా, వి.సావరం ఉప సర్పంచ్ వెలగల సత్యనారాయణరెడ్డి, అంగర ఎస్ఐ చంటి, మండపేటరూరల్ ఎస్సై శివకృష్ణ, ఏ ఎస్ ఐ ,పి హెచ్ సి మాధవ రెడ్డి, వెంకటేశ్వరరావు, కొల్లి రాంబాబు, మల్లిడి వెంకట రెడ్డి, మాజీ సర్పంచ్ పాలంగి చినబాబు, వెలగల పణిక్రిష్ణ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎస్సై సురేష్ అభిమానులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement