WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ఒక్కసారిగా పెరిగిన వరద.. కొనసాగుతున్న రిస్క్యూ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

  • టాగ్స్
  • Rain
రెండు రోజుల నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది.
శుక్రవారం(ఆగస్ట్ 30) సాయంత్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపధ్యంలోనే పులిచింతల ప్రాజెక్ట్ వస్తున్న వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.

విశ్వం వాయిస్ బ్యూరో న్యూస్, కృష్ణా

రెండు రోజుల నుండి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు క‌ృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. శుక్రవారం(ఆగస్ట్ 30) సాయంత్రం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పులిచింతల ప్రాజెక్ట్ వస్తున్న వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 6,50,000 క్యూసెక్కులు ప్రాజెక్ట్ కు వస్తుండగా 6.25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచి పెడుతున్నారు. దీంతో లంక గ్రామాల చుట్టూ నీరు చేరింది.

అయితే శుక్రవారం ఉదయాన్నే లంక గ్రామాల్లో గొర్రెలను మేపుకొనేందుకు వెళ్లిన కాపరలు వరద నీరు చుట్టుముడుతుండటంతో ఆందోళనకు గురయ్యారు. లంకల్లో నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా భారీ వర్షం కారణంగా రాలేకపోయారు. తాజాగా కొంత మేర వర్షం తగ్గుముఖం పట్టినా, కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో బయటకు రాలేక గొర్రెల కాపరులు బిక్కుబిక్కుమంూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం సహాయకచర్యలు ముమ్మరం చేసింది.

దీంతో గొర్రెలతో సహా ఒడ్డకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కొంతమంది గొర్రెల కాపరులు తమను కాపాడాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తామున్న పరిస్థితులను వివరిస్తూ వీడియోలు పంపించారు. కోనూరు, కస్తల, మునగోడు, దిడుగు, ధరణి కోట, అమరావతి, వైకుంఠపురంలోని లంకల్లో గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. మరోవైపు పులిచింతల నుండి దిగువకు గంట గంటకు నీటి విడుదలను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కాపరులు ఆందోళనకు గురవుతున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement