Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మారు బేరానికి ప్రజా పంపిణీ బియ్యం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ప్రజా పంపిణిలోని 350 కిలోల బియ్యం పట్టివేత…!

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంకవరం:

 

శంఖవరం, ఏప్రిల్ 20, (విశ్వం వాయిస్ న్యూస్) ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పంపిణీ చౌక ధరల దుకాణాల్లో లబ్దిదారులకు రాయితీ ధరకు అమ్మిన బియ్యాన్ని కొనుగోలు చేసి మారు అమ్మకానికి అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని శంఖవరం మండలం సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. బుధవారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో ప్రజా పంపిణీ బియ్యా (పిడిఎస్ రైసు) న్ని ఒక ఆటోలో
అక్రమంగా రవాణా చేస్తున్న కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంఖవరం అంబేద్కర్ నగర్ కు చెందిన దడాల నాగసత్య నారాయణ (తండ్రి నాగరాజు) ను అతనిని ఎమ్ఎస్ఓ ఇస్మాయిల్ ఆధ్వర్యంలో అదుపులోనికి తీసుకున్నారు. అతని నుంచి 350 కిలోల పిడిఎస్ బియ్యాన్ని, వాటిని రవాణా చేయడానికి ఉపయోగించిన ఆటోను
స్వాధీనం చేసుకొన్నారు. ఎవరైనా అక్రమంగా ప్రజా పంపిణీ చిత్రాన్ని అక్రమంగా రవాణా చేసినా, నిల్వ చేసినా, తరలించినా, ఆ బియ్యంతో వ్యాపారం చేస్తున్న వారిపై చట్ట పరంగా కఠిన చర్యలను తీసుకుంటామని ఎమ్ఎస్ఓ. ఇస్మాయిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తనిఖీల్లో అన్నవరం ఎస్ఐ. శోభన్ బాబు కూడా ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement