సచివాలయం తనిఖీ
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ సిటీ:
రహదారి నిర్మాణ పనులు పరిశీలన
సచివాలయం తనిఖీ
కాకినాడ, విశ్వం వాయిస్ సిటీ న్యూస్:
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ .నాగ నరసింహారావు బుధవారం 9 వ డివిజన్ లో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని,నాణ్యతా ప్రమాణాలను ఆరా తీశారు. నిర్మాణ పనులను మరింత వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో చేపట్టేలా పర్యవేక్షించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం 9 ఏ సచివాలయాన్ని సందర్శించారు. సచివాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఆయన వెంట కార్పొరేటర్ కంపర బాబి అధికారులు ఉన్నారు.