విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
బార్ అసోసియేషన్ లో ఎన్నికల సందడి ప్రారంభమైంది.మే నెల 6వ తేదీన జరగబోయే ఎన్నికల కొరకు నామినేషన్ల స్వీకరణ ఘట్టం సోమవారం
ప్రారంభించారు.ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తొలి రోజు ఉత్సాహంగా తమ నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఏలూరు సుబ్రహ్మణ్యం నామినేషన్ వేశారు. కార్యదర్శిగా శంకు సింగ్ తన నామినేషన్ పత్రాలను ఎలక్షన్ అధికారులకు అందజేశారు. ఉపాధ్యక్ష పదవికి కట్ట బహు దేవత ప్రతాప్ కుమార్ నామినేషన్ వేశారు. ఎల్ ఆర్ గా ఉమామహేశ్వరి , లైబ్రరీ సెక్రటరీగా వెలిగొండ శ్రీనివాస్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా మూర్తి, మేడపాటి రామారెడ్డి, శ్రీదేవి, కమిటీ మెంబర్ గా గండిగూడ కళ్యాణి తమ నామినేషన్ ఎలక్షన్ ఆఫీసర్ కి అందజేశారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా తుమ్మలపల్లి చంద్రశేఖర్ వ్యవహరించగా, ఎలక్షన్ నిర్వాహకులుగా సీనియర్ న్యాయవాదులు కె వి వి చలపతి, కంబాల శ్రీధర్, వెంకట్ ఆర్.బి.షా వ్యవహరిస్తున్నారు. కూడా నామినేషన్ దాఖలు గడువు బుధవారం తో ముగుస్తుంది. అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.