WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

ప్రతీ ఒక్కరూ సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలి
– ఎటపాక ప్రెస్ క్లబ్ కోశాధికారి వసంతాల రమేష్
– అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు వితరణ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:

మండలంలోని గన్నవరం గ్రామ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఎటపాక ప్రెస్ క్లబ్ కోశాధికారి వసంతాల రమేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం గన్నవరం గ్రామంలో తన వంతు సహాయ సహకారాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. 6 అగ్ని బాధిత కుటుంబాలకు 25 కేజీల చొప్పున బియ్యం మరియు ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున నగదును ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎటపాక ప్రెస్ క్లబ్ కోశాధికారి వసంతాల రమేష్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలన్నారు. మానవ సేవే మాధవ సేవ అని , ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మానవతా దృక్పథంతో తమకున్న దాంట్లో వితరణ అందజేసి సేవాగుణాన్ని చాటుకోవాలని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి మొత్తం 6 కుటుంబాల వారు నిరాశ్రయులవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్ని బాధిత కుటుంబాలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement