Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ప్రతీ ఒక్కరూ సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలి
– ఎటపాక ప్రెస్ క్లబ్ కోశాధికారి వసంతాల రమేష్
– అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు వితరణ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:

మండలంలోని గన్నవరం గ్రామ అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఎటపాక ప్రెస్ క్లబ్ కోశాధికారి వసంతాల రమేష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం గన్నవరం గ్రామంలో తన వంతు సహాయ సహకారాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. 6 అగ్ని బాధిత కుటుంబాలకు 25 కేజీల చొప్పున బియ్యం మరియు ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల చొప్పున నగదును ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎటపాక ప్రెస్ క్లబ్ కోశాధికారి వసంతాల రమేష్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ సేవా కార్యక్రమాలను అలవర్చుకోవాలన్నారు. మానవ సేవే మాధవ సేవ అని , ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మానవతా దృక్పథంతో తమకున్న దాంట్లో వితరణ అందజేసి సేవాగుణాన్ని చాటుకోవాలని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి మొత్తం 6 కుటుంబాల వారు నిరాశ్రయులవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అగ్ని బాధిత కుటుంబాలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement