విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం విశ్వం వాయిస్ న్యూస్:
ధాన్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ అదే మార్గాన్ని మోటార్ సైకిల్ పై వస్తున వ్యక్తిని ఢీ కొట్టడంతో మృతి చెందిన సంఘటన పై ఎస్ ఐ ఎస్ పి.వి ఎస్ ఎస్ఎన్ సురేష్ స్థానిక విలేకరులకు తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెదురుపాక గ్రామానికి చెందిన తూర్పు డి వెంకటేష్ (30) అను వ్యక్తి తాపీ పని చేసుకుంటూ భార్య సావిత్రి, పాప బాబులతో కుటుంబాన్ని పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి పని ముగించుకుని వెంకటేష్, సురేష్ లు కలిసి ద్విచక్రవాహనంపై వెదురుపాక గీత మందిరం సమీపంలోకి వచ్చేసరికి అరికరేవుల నుంచి వెదురుపాక వస్తున్న ధాన్యం లోడు ట్రాక్టర్ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో వెంకటేష్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా సురేష్ అనే మరో వ్యక్తి గాయాల పాలయ్యారు. వెంకటేష్ తండ్రి సత్యారావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.