Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కౌన్సిలో గ్రామాలు విలీనంపై ప్రతిపాదనలు చేపట్టాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– నగర, రూరల్ ఎమ్మెల్యే లు
– 6 గ్రామాలు..2 డివిజన్లు..12 ఏళ్లుగా ఎన్నికలకు
దూరమయ్యాయి
– పౌర సంక్షేమ సంఘం విజ్ఞప్తి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ ,రమణయ్యపేట ,వలసపాకల, వాకలపూడి మున్నగు 6 గ్రామాల ను పంచాయతీ పాలన నుండి వేరు చేసి 12 ఏళ్లయ్యిందని స్థానిక కార్పోరేషన్ లో కలిపేందుకు కౌన్సిల్ తీర్మానం చేయాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. 2010 నుండి 17వరకు 7సంవత్సరాలుగా కౌన్సిల్ లేకపోవడం వలన విలీనం చేసుకునే తీర్మానం చట్టపరంగా సాధ్యం కాలేదని పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ నిలిచిపోయిన 42,48 డివిజన్లు గంగనాపల్లి టీచర్స్ కాలనీ విలీన తీర్మానం లేక కోర్టు వ్యాజ్యానికి కారణ మయ్యిందన్నారు. 2017-22 కౌన్సిల్ పదవీకాలం సెప్టెంబర్ తో ముగిసిపోతున్నం దున ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే సిటీ ,రూరల్ ఎమ్మెల్యేలు స్థానిక కౌన్సిల్ లో విలీన తీర్మానం ప్రతిపాదనలు ప్రవేశపెట్టాలని కోరారు. గ్రామాలవిలీనం తో 60 డివిజన్ల విభజన ఏర్పాటు చేపట్టి సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని పౌర సంఘం విజ్ఞప్తి చేసింది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement