Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కోనసీమ జిల్లా మండపేట నియెజికవర్గం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:

మండపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )

కోనసీమ గాడ్ సర్వెంట్ ఫెలోషిప్ జిల్లా రాష్ట్ర నాయకుల సదస్సు మండపేట అపోస్తోలిక్ కింగ్స్ టెంపుల్ లో బిషప్ ప్రసాద్ పాల్ ఆధ్వర్యంలో జిల్లా కోనసీమ గాడ్ సర్వెంట్ అధ్యక్షులు బాబు సైన్ అధ్యక్షతన పాస్టర్ ల సమావేశం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎం. వేద నాయకం విచ్చేసి పాస్టర్లకు వాక్య సందేశం ఇచ్చి మెలకువలు నేర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ప్రెసిడెంట్ బాబు సైమన్ మాట్లాడుతూ పాస్టర్లకు ఈ ఫెలోషిప్ ఎంతగానో తోడ్పాటును ఇస్తుందని, వారి కష్ట సమయాల్లో అన్ని విధాలుగా ఆదుకుంటామని, పాస్టర్లు ఎవరైనా చనిపోతే సమాధి ఖర్చు మొత్తం యూనియన్ భరిస్తుందని తెలిపారు.

రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ పాల్ మాట్లాడుతూ కోనసీమ గాడ్స్ సర్వెంట్ ఫెలోషిప్ రాష్ట్ర, జిల్లా స్థాయిలో బలోపేతం చేసే విధంగా కృషి చేస్తామని మండలాల్లో ఉన్న యూనియన్లు అన్ని కలుపుకొని ఐక్యంగా కలిసి పని చేస్తామని పేర్కొన్నారు.

అనంతరం కోనసీమ గాడ్స్ సర్వెంట్స్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ప్రెసిడెంట్ గా బాబు సైమన్, గౌరవ అధ్యక్షులుగా ఏ. పాల్, జిల్లా సెక్రెటరీ ఎస్. విజయబాబు, వైస్ ప్రెసిడెంట్ పి. ఎస్. కుమార్ రత్నం, జిల్లా ట్రెజరర్ డి. రాజు, జిల్లా జాయింట్ సెక్రెటరీ విజయ్ కుమార్, ప్రేమ సుధీర్, రాజు లను ఎన్నుకోవడం జరిగింది. తదుపరి కమిటీ అందరికీ సన్మానం చేసి సర్టిఫికెట్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాస్టర్లు స్థానిక చర్చి విశ్వాసులు, యూత్, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement