విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్ : రికార్డులకు, నిల్వలకు మధ్య తేడా ఉన్నందున ఈ మూడు చౌకధరల దుకాణాల డీలర్లు. ఎండీయూ వాహనదారునిపై 6ఏ కేసు నమోదు చేశామని విజిలెన్స్ సీఐ డి.శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చౌక ధరల దుకాణాలపై శుక్రవారం విజిలెన్స్ దాడులు నిర్వహించారు. రాయవరం ఒకటో నంబర్ దుకాణంలో 100 కేజీల కందిపప్పు, రెండో నంబర్ దుకాణంలో 1.300 కేజీల బియ్యం. ఎండీయూ వాహనంలో 23 కేజీల కందిపప్పును గుర్తించామ న్నారు. వెదురుపాక 4 వ నంబర్ దుకాణంలో 140 కేజీల కందిపప్పు రికార్డులకు నిల్వలకు వ్యత్యాసం ఉందన్నారు. రికార్డులకు, నిల్వలకు మధ్య తేడా ఉన్నందున ఈ మూడు చౌకధరల దుకాణాల డీలర్లు. ఎండీయూ వాహనదారునిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. ఈ మూడు దుకాణాలను సమీప దుకాణదారులకు అప్పగిం చాలని ఆదేశించామని తెలిపారు. తనిఖీల్లో తహ సీల్దార్ కేజే ప్రకాష్ బాబు, ఎంఎస్వో సాయికి రణ్, ఆర్ఎస్ఐ, వీఆర్వోలు పాల్గొన్నారు.