Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 1:12 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 1:12 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 1:12 PM
Follow Us

ఆంధ్రప్రదేశ్ లో భాజపా అధికారంలోకి రావాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, మే 10, (విశ్వం వాయిస్ న్యూస్) ;

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలూ అందరూ సమిష్ఠిగా కృషి చేయాలని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బిట్రా వెంకట శివనారాయణ పిలుపును ఇచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ప్రత్తిపాడు మండల పార్టీ కార్యవర్గ సమావేశాన్ని ప్రత్తిపాడులో రాజా కింగుబాబు రాజు స్వగృహంలో మండల కమిటీ అధ్యక్షుడు గున్నాబత్తుల రాజబాబు అధ్యక్షతన మంగళవారం ఉదయం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకట శివనారాయణ ముఖ్య అతిథిగా
పాల్గొని మార్గదర్శనం చేసారు. మండలంలోని అన్ని పోలింగు బూత్ లకు వేసిన బూత్ కమిటీలను బలోపేతం చేయాలని, ఐదు బూత్ కేంద్రాలకు ఒక శక్తి కేంద్ర కమిటీని వేయాలని, రాష్ట్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చే విధంగా కార్యకర్తలు అందరూ కష్ట పడి సైనికుల్లా పని చేయాలని ఆయన పేర్కొన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్టానికి ప్రజా సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారనీ, రేషను దుకాణములద్వార మనిషి ఒక్కంటికి 5 కేజీల బియ్యాన్ని కేజీ ఒక్కంటికి 1 రూపాయి చొప్పున పంపిణీ చేయడం జరుగుతుందని, అలాగే కరోనా సమయంలో దేశ ప్రజలు ఆర్దికంగా ఇబ్బంది పడకుండా ఉండాలని ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కోరిక వల్ల జాతీయ అధ్యక్షులు నడ్డా జూన్ నెలలో రాజమండ్రి
రానున్నారని పోలింగు బూత్ కమిటీ సభ్యులు అందరూ ఆ సభలో పాల్గొని విజయ వంతం చేయాలని కార్యకర్తలను కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు తెలపాలని చిలుకూరి రామకుమార్ అన్నారు. ఈ సమావేశంలో
రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, శింగిలిదేవి సత్తిరాజు, గండి కొండలరావు, కించు జోగిరాజు, కర్రి ధర్మరాజు, మదినే బాబ్జీ, కందా వీరాస్వామి, అజ్జరపు బుల్లియ్య పెకేటి శివ, గొల్ల కుమారి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement