Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 19, 2024 8:04 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 19, 2024 8:04 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 19, 2024 8:04 PM
Follow Us

తాతపూడి గ్రామ డ్వాక్రా మహిళలు ను నిండా ముంచిన ఎనిమేటర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వపురం:

 

కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్) డ్వాక్రా సంఘానికి సంబంధించిన సభ్యుల సంతకాలు ఫోర్జరీ లు చేసి సొమ్ములు కాజేసింది ఓ డ్వాక్రా యానిమేటర్. మీ గ్రూప్ సభ్యులకు బాకీలు ఉన్నాయంటూ అధికారులు నోటీసులు ఇవ్వడంతో వారు అవాక్కయ్యారు..మండల కేంద్రం కపిలేశ్వరపురం మహిళా సమాఖ్య కార్యాలయం సిబ్బంది రికవరీ ల పై తాత పూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేశారు. 2010-13 సంవత్సరాలలో తాత పూడి గ్రామానికి చెందిన యానిమేటర్ కోలాటి నాగ మని గ్రామానికి చెందిన సత్య సాయి , కల్కి భగవాన్ , సోని , ప్రియాంక , రాజీవ్ , మహాత్మా గాంధీ గ్రూప్ లకు సంబంధించిన స్రీ నిధి , సి ఐ ఎఫ్ నిధులకు సంబంధించిన సొమ్ము చెల్లింపు విషయంలో చెక్ ల పై సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి సుమారు నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు స్వాహా చేసినట్లు ఆ సంఘ సభ్యులు తెలిపారు..దీనికి సంబంధించిన ఏ విధమైన సొమ్ము తాము తీసుకోలేదని అధికారులకు లిఖిత పూర్వక పిర్యాదు చేశారు..సంబంధిత వ్యక్తిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని మండల మహిళ సమాఖ్య ఏ పీ ఎమ్ తౌడు బాబు తెలిపారు.. సమావేశంలో పీ. సి.భగవాన్ రావు , యానిమాటర్ లు గడ్డం శ్రీ నవ్య , పాలచర్ల వర లక్ష్మి పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement