Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– విద్యార్థులు విద్యావంతులు కావాలి
– జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

తూర్పుగోదావరి, విశ్వం వాయిస్ః

జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లోని అన్ని గ్రంథాలయాలలో ది 17.5. 2022 నుండి 30.6.2022 వరకు నిర్వహించే వేసవి విజ్ఞాన శిబిరాల కు సంబంధించిన పోస్టర్ను కరపత్రాలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సోమవారం నాడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని గ్రంథాలయాల్లో నిర్వహించే వేసవి విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకొని పాఠశాల విద్యార్థులు విజ్ఞానవంతులు కావాలని తెలిపారు. అనంతరం వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం. శేఖర్ బాబు, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement