విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రంపచోడవరం:
చింతూరు -విశ్వం వాయిస్ న్యూస్ (17-5-2022)
అల్లూరిసీతారామరాజు జిల్లా, రంపచోడవడం నియోజకవర్గం, చింతూరు మండలంలోని కుమ్మురు గ్రామంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఇల్లా చిన్న రెడ్డి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో చిన్నరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు గురించి. నిత్యావసర ధరలు మరియు …పెరిగిన డీజిల్ ,పెట్రోల్ గ్యాస్ ..ధరల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైసిపి ప్రభుత్వ వైఖరి పై మండిపడ్డారు.
గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.
ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు ఇల్లా చిన్నరెడ్డి , పార్టీ సీనియర్ నాయకులు ఉపాధ్యక్షులు పొదిలి రామారావు , సల్మాన్ రాజు , కట్ల శంకర్, అణిగి చంద్రయ్య , గ్రామ శాఖ అధ్యక్షులు సోడే రాఘవయ్య హరిబాబు, శ్రీహరి కుమ్మురు గ్రామ పెద్దలు కార్యకర్తలు అభిమానులు ఐ టీ డీ పి కోఆర్డీనేటర్ యస్. వినోద్ గారు తదితరులు పాల్గొన్నారు.