విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
పి.గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)
మండలం లో ఊడిమూడి లంక గోదావరి నదిలో అమలాపురం మండలం వేమవారానికీచెందిన యర్రంశెట్టి రాజా(22)ప్రమాదవశాత్తు గోదావరిలో పడి గల్లంతయ్యారు, గత నెల స్నేహితులు వివాహానికి వచ్చి గోదావరి నది అందాలను చూసి ఈరోజు స్నేహితులతో కలిసి గోదావరి నదిలోకి స్థానానికి వచ్చి ప్రమాదవశాత్తు నదిలో గల్లంతయ్యారు స్థానిక ఎస్సై జి సురేంద్ర ప్రమాద స్థలాన్ని చేరుకుని ని స్థానిక మత్స్యకారులుచే గాలింపు చర్యలు చేపట్టారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు ఆయన వెంట జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు మంతెన ఠవిరాజు గంటి పెదపూడి సర్పంచ్ దంగేటి సత్యనారాయణ ఊడిమూడి సర్పంచ్ నౌకపై ప్రసన్నకుమార్ స్థానిక ఎంపిటిసి పల్లి మోషే సాధనాలరమేష్ తదితరులు పాల్గొన్నారు