విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
మండపేట అర్బన్ ( విశ్వ వాయిస్ )
కోనసీమ జిల్లాను డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి వైఎస్సార్సీపీ నాయకులు పలివేల సుధాకర్ కృతజ్ఞతలు తెలిపారు. మండపేట లో బుధవారం మీడియా తో ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దీనికి సహకరించిన అమలాపురం ఎంపీ , జిల్లా మంత్రులకు జిల్లా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పేరు సాధన లో సహకరించిన అంబేద్కర్ అభిమానులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.